దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 3,52,991 కరోనా పాజిటివ్ కేసులు, 2812 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,73,13,163 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,95,123 కి పెరిగింది. కరోనా వ్యాప్తి వెలుగులోకి వచ్చాక ప్రపంచవ్యాప్తంగా రోజువారీగా నమోదయిన కరోనా కేసుల సంఖ్యలో ఇదే (3,52,991) అత్యధికం. అలాగే కరోనా వైరస్ వెలుగులోకి వచ్చాక దేశంలో ఇంత పెద్దసంఖ్యలో (2812) కరోనా మరణాలు చోటుచేసుకోవడం కూడా ఇదే తొలిసారి.
ముఖ్యంగా మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి 10 రాష్ట్రాల్లోనే గత 24 గంటల్లో కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అయ్యాయి. కరోనా కేసులు భారీగా పెరగడంతో దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 28,13,658 (16.25%) చేరువైంది. మరో 2,19,272 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 1,43,04,382 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 82.62 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.13 శాతంగా నమోదైంది. కాగా గత 24 గంటల్లో త్రిపుర, మిజోరం, లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్, దాద్రా మరియు నగర్ హవేలి మరియు డామన్ మరియు డయ్యు వంటి 5 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎటువంటి కరోనా మరణాలు సంభవించలేదు.
దేశంలో కరోనా కేసులు వివరాలు (ఏప్రిల్ 26, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య: 27,93,21,177
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 1,73,13,163
- కొత్తగా నమోదైన కేసులు [ఏప్రిల్ 25–ఏప్రిల్ 26 (8AM-8AM)] : 3,52,991
- నమోదైన మరణాలు : 2812
- రికవరీ అయిన వారి సంఖ్య : 1,43,04,382
- యాక్టీవ్ కేసులు : 28,13,658
- మొత్తం మరణాల సంఖ్య : 1,95,123
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ