మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గతకొన్ని రోజులుగా రోజువారీ కరోనా కేసులు 5 వేలు లోపుగానే నమోదవుతున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 19, ఆదివారం నాడు 3,413 కరోనా కేసులు, 49 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 65,21,915 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,38,518 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 8,326 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 63,36,887 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 97.16 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.12 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 42,955 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు ఆదివారం నాటికి మహారాష్ట్రలో 5,70,28,476 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ