ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 1,10,147 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 21,954 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 3531, చిత్తూరులో 2354, విశాఖపట్నంలో 2107, శ్రీకాకుళంలో 1939, కర్నూల్ లో 1920, అనంతపూర్ లో 1871 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12,28,186 కు చేరుకుంది.
ఇక కరోనా వలన విశాఖపట్నంలో పదకొండు మంది, తూర్పుగోదావరిలో తొమ్మిది మంది, విజయనగరంలో తొమ్మిది మంది, అనంతపూర్ లో ఎనిమిది మంది, ప్రకాశంలో ఆరుగురు, చిత్తూరులో ఐదుగురు, పశ్చిమగోదావరిలో ఐదుగురు, గుంటూరులో ఐదుగురు, కృష్ణాలో నలుగురు, కర్నూల్ లో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, నెల్లూరులో ఇద్దరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 8446 కి పెరిగింది. గత 24 గంటల్లో 10141 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 10,37,411 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,82,329 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ