కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. బుధవారం నాడు ఒక్కరోజే 41,953 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజువారీగా కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతుండటంతో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 8వ తేది నుంచి మే 16 వరకు లాక్డౌన్ విధిస్తున్నట్లు కేరళ సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. “కేరళ రాష్ట్రం మొత్తం మే 8 ఉదయం 6 గంటల నుండి మే 16 వరకు లాక్డౌన్ లో ఉంటుంది. బలమైన కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోబడింది” సీఎం పినరయి విజయన్ పేర్కొన్నారు.
మరోవైపు కేరళలో ఇప్పటివరకు మొత్తం 17,43,933 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 13,62,363 మంది కరోనా నుంచి కోలుకోగా, 5,566 మంది మరణించారు. ప్రస్తుతం 3,75,657 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల్లో కేరళ రెండో స్థానంలో కొనసాగుతుంది. అలాగే ప్రస్తుతం అత్యధిక యాక్టీవ్ కేసులు కలిగి ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర(6,41,596), కర్ణాటక (4,87,288) తర్వాత కేరళ (3,75,657) మూడో స్థానంలో ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ