సీనియర్ కాంగ్రెస్ నేత, రాజస్థాన్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా (89) కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం కరోనా బారినపడిన ఆయన ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్టు తెలిపారు. 1980-81 లో జగన్నాథ్ పహాడియా రాజస్థాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే హర్యానా మరియు బీహార్ రాష్ట్రాలకు గవర్నర్ గా కూడా పనిచేశారు. జగన్నాథ్ పహాడియా మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సహా పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు పహాడియా మృతికి రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఒకరోజు సంతాప దినంగా ప్రకటించింది. ఆయనకు సంతాపం తెలిపేందుకు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించారు. అలాగే ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పహాడియా అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ