ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం మే 20, గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయింది. బడ్జెట్ సమావేశం ప్రారంభం అయిన వెంటనే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. సమావేశాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ప్రతిపక్ష టీడీపీ పార్టీ అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరిస్తునట్టు ప్రకటించింది.
కరోనా వ్యాప్తి, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలను ఒక్కరోజే నిర్వహిస్తున్నారు. గురువారం నాడే సభలో బడ్జెట్ ప్రవేశపెట్టి చర్చించి, ఆమోదించనున్నారు. 2021–22 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శాసన మండలిలో హోంమంత్రి సుచరిత ప్రవేశపెట్టనున్నారు. అలాగే వ్యవసాయ బడ్జెట్ ను అసెంబ్లీలో మంత్రి కన్నబాబు, శాసన మండలిలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రవేశపెట్టనున్నారు.
గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించారు. అనంతరం సభలో గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చించనున్నారు. అలాగే సభలో పలువురి సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు బడ్జెట్ సమావేశం సందర్భంగా ఈ రోజు ఉదయం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో 2021-2022 రాష్ట్ర బడ్జెట్కు మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రంలో తొలిసారిగా జెండర్ బేస్డ్ బడ్జెట్ తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. దాదాపుగా 2.30 లక్షల కోట్ల అంచనాలతో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ