కరోనా వ్యాక్సిన్ డోసుల నిల్వలు తగినంతగా లేకపోవడంతో తెలంగాణ రాష్ట్రంలో మే 15 నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి సెకండ్ డోస్ వ్యాక్సిన్ అందించే స్పెషల్ డ్రైవ్ వాయిదాపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంను మే 25, మంగళవారం నుంచి ప్రారంభించాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే మొదటి డోసు పూర్తిచేసుకుని రెండో డోసు కోసం అర్హత కలిగిన వాళ్లు దగ్గరలో వున్న ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి వ్యాక్సినేషన్ వేయించుకోవాలని సీఎం కోరారు. అలాగే ఈ వైరస్ ను ఎక్కువగా వ్యాప్తి చేసే అవకాశం ఉన్నవారిని గుర్తించి వారికి ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని, అందుకు సంబంధించిన విదివిధానాలను రూపొందించాలని మంత్రి హరీశ్ రావును, వైద్యారోగ్యశాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ