భారత్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. నవంబర్ 9, సోమవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 85,53,657 కు, మరణాల సంఖ్య 1,26,611 కు చేరుకుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 47,638 కరోనా పాజిటివ్ కేసులు, 670 కరోనా మరణాలు నమోదయ్యాయి. మరోవైపు ఇప్పటికే 79 లక్షల మందికి పైగా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఒకే రోజులో 48,405 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 79,17,373 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 92.56 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.48 శాతంగా ఉంది. అలాగే దేశవ్యాప్తంగా ప్రస్తుతం 5,09,673 మంది చికిత్స పొందుతున్నారు. ఇక దేశంలో నవంబర్ 8 నాటికీ 11,85,72,192 కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లోనే 8,35,401 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ