దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ : రాష్ట్రాలకు 193.5 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు అందజేత

Covid Vaccination in India More than 193.53 Crore Vaccine Doses Provided to States UTs, Vaccination in India More than 193.53 Crore Vaccine Doses Provided to States UTs, Covid Vaccination in India, More than 193.53 Crore Vaccine Doses Provided to States UTs, Wuhan Virus Vaccination Drive, Wuhan Virus Vaccination, Wuhan Virus, Corona Vaccination Drive, Corona Vaccination Programme, Corona Vaccine, Coronavirus, coronavirus vaccine, coronavirus vaccine distribution, COVID 19 Vaccine, Covid Vaccination, Covid vaccination in India, Covid-19 Vaccination, Covid-19 Vaccination Distribution, COVID-19 Vaccination Dose, Covid-19 Vaccination Drive, Covid-19 Vaccine Distribution, Covid-19 Vaccine Distribution News, Covid-19 Vaccine Distribution updates, Mango News, Mango News Telugu,

దేశంలో కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా ప్రస్తుతం 12 ఏళ్లు పైబడివారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీతో పాటుగా 18 ఏళ్లు పైబడిన వారందరికీ ప్రికాషన్ డోస్ పంపిణీ కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో భాగంగా అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు అందించిన మరియు ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ డోసుల వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఉచిత కేటగిరీ, ప్రత్యక్ష రాష్ట్ర సేకరణ కేటగిరి ద్వారా ఇప్పటికి మొత్తం 193.53 కోట్లకుపైగా (1,93,53,58,865) కోవిడ్ వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందించినట్టు తెలిపారు. అలాగే అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మే 9, సోమవారం నాటికీ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించేందుకు 18.34 కోట్లకు పైగా (18,34,94,170) నిల్వలు, వినియోగించని వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

3.05 కోట్లమందికిపైగా 12-14 ఏళ్ల పిల్లలకు తొలి డోసు కోవిడ్ వ్యాక్సిన్:

మరోవైపు దేశంలో మే 9, సోమవారం ఉదయం 7 గంటల వరకు ప్రజలకు అందించిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 190.34 కోట్లు (1,90,34,90,396) దాటినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక 12-14 సంవత్సరాల వయస్సు గల వారికి మార్చి 16, 2022న కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రారంభించగా, ఇప్పటివరకు 3.05 కోట్లమందికిపైగా (3,05,07,974) మొదటి డోస్‌ వ్యాక్సిన్, 98,85,187 మందికి రెండో డోస్ వ్యాక్సిన్ అందించినట్టు వెల్లడించారు. అదేవిధంగా 18-59 సంవత్సరాల వయస్సు గల వారికి ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఏప్రిల్ 10 నుండి కోవిడ్-19 ప్రికాషన్ డోస్ అందించడం ప్రారంభమవగా, ఇప్పటివరకు 10,94,710 మంది ప్రికాషన్ డోస్ తీసుకున్నారు. ఇక 60 సంవత్సరాలు పైబడినవారికీ ప్రభుత్వం ఉచితంగా ప్రికాషన్ డోస్ డోస్ అందిస్తుండగా, ఇప్పటివరకు 1,56,88,626 మంది తీసుకున్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + twelve =