కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్దగల చెక్ పోస్టుల వద్ద పాటించాల్సిన నియమాలు, వాహనాల ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి సోమవారం నాడు సూచనలు జారీ చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి వచ్చే అంబులెన్స్ వాహనాలను ఈ-పాస్ ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండా రాష్ట్రంలోకి అనుమతించాలని చెప్పారు.
ఇక వాహనాల్లో ప్రయాణించే వ్యక్తులందరికి తెలంగాణలోకి ప్రవేశించాలంటే తప్పనిసరిగా సంబంధిత రాష్ట్రాల అధికారులు జారీ చేసిన ఈ-పాస్ లేదా తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన ఈ-పాస్ ఉంటేనే రాష్ట్రంలో అనుమతిస్తామని పేర్కొన్నారు. అంబులెన్స్ మరియు ఇతర అనుమతి ఉన్న వాహనాల కోసం రాష్ట్రంలోకి సజావుగా ప్రవేశించడానికి సరిహద్దుల వద్ద సరైన సంకేతాలతో ప్రత్యేక లేన్/దారి ఏర్పాటు చేయబడుతుందని తెలిపారు. అధికారులంతా ఈ సూచనలను తప్పకుండా అమలుచేయాలని, అలాగే చెక్ పోస్టుల వద్ద విధులు నిర్వహించే అధికారులకు కూడా ఈ సూచనలను వివరించాలని డీజీపీ మహేందర్ రెడ్డి మెమోరాండంలో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ