కరోనా వ్యాప్తి నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు సాయంగా పలుసంస్థలు విరాళాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనాపై పోరుకు మద్ధతుగా తాజాగా కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఏపీ సీఎం సహాయనిధికి రూ.2 కోట్ల భారీ విరాళాన్ని అందించింది. ఈ మేరకు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ గోయెల్, వైస్ ప్రెసిడెంట్ కె.సత్యనారాయణ బుధవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి విరాళానికి సంబంధించిన పత్రాలను అందజేశారు.
మరోవైపు కరోనా వైరస్ నియంత్రణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు అండగా నిలిచేందుకు తెలంగాణ సీఎం సహాయ నిధికి కూడా కోరమండల్ సంస్థ కోటి రూపాయలను విరాళంగా అందించింది. మే 25న ఎండీ సమీర్ గోయల్, వైస్ ప్రెసిడెంట్ కె.సత్యనారాయణ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి కోటి రూపాయల చెక్కును అందజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ