ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు నెల్లూరు, కడప, ఒంగోలు, శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రుల్లో సిటీస్కాన్, ఎంఆర్ఐ మిషన్లను ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ వర్చువల్గా నాలుగు ఆసుపత్రుల్లో ఈ సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, నాడు-నేడు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులను మరింత బలోపేతం చేసి పేదవాడికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
రాష్ట్రంలో 11 టీచింగ్ ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అందులో కేవలం 7 ఆసుపత్రుల్లో మాత్రమే సీటీస్కాన్లు అందుబాటులో ఉన్నాయని, టెక్నాలజి, సాప్ట్వేర్ అప్డేట్ చేయలేదు. ఈ పరిస్థితి నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆసుపత్రులను అన్నింటిని కూడా మార్చబోతున్నామని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఈ రెండేళ్లలో మరో 16 టీచింగ్ ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని, వీటన్నింటినీ ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొస్తామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ