దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. రోజువారీ కరోనా కేసుల్లో తగ్గుదల కొనసాగుతుంది. వరుసగా 9వ రోజు కూడా లక్ష కంటే తక్కువ కేసులు నమోదవగా, వరుసగా 34 రోజూ కూడా కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువుగా ఉన్నాయి. అయితే కరోనా మరణాలు పెద్ద సంఖ్యలో చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. గత 24 గంటల్లో కొత్తగా 62,224 కేసులు, 2542 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,96,33,105 కు చేరుకోగా, మరణాల సంఖ్య 3,79,573 కి పెరిగింది.
కొత్తగా నమోదైన కేసుల్లో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అస్సాం, ఒడిశా, వెస్ట్ బెంగాల్, తెలంగాణ, పంజాబ్ వంటి 10 రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. దేశంలో ప్రస్తుతం 8,65,432 (2.92%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరో 1,07,628 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 2,83,88,100 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 95.80 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.28 శాతంగా నమోదైంది.
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన 10 రాష్ట్రాలివే (జూన్ 15 8am–జూన్ 16 8am) :
- కేరళ – 12246
- తమిళనాడు – 11805
- మహారాష్ట్ర – 7652
- ఆంధ్రప్రదేశ్ – 5741
- కర్ణాటక – 5041
- అస్సాం – 3415
- ఒడిశా – 3405
- వెస్ట్ బెంగాల్ – 3268
- తెలంగాణ – 1556
- పంజాబ్ – 628
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ