ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆగస్టు 4, బుధవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని దత్తత గ్రామం వాసాలమర్రిలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాలకు దళితబంధు పథకాన్ని వెంటనే అమలు చేయనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అందుకోసం అవసరమైన రూ.7.60 కోట్లు తక్షణమే మంజూరు చేస్తున్నానని, గురువారం నుంచే దళితుల ఖాతాల్లో రూ.10 లక్షల చొప్పున నగదు జమ చేస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం నాడు వాసాలమర్రికి “తెలంగాణ దళిత బంధు” పథకం నిధులును రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
76 దళిత కుటుంబాలకు 7 కోట్ల 60 లక్షలను యాదాద్రి భువనగిరి కలెక్టర్ ఖాతాలో జమ చేశారు. సీఎం కేసీఆర్ బుధవారం చేసిన ప్రకటన మేరకు నిధులు విడుదల చేయడం జరిగిందని, టీఎస్ సీసీడీసీ లిమిటెడ్ (హైదరాబాద్) వైస్ ఛైర్మన్ అండ్ ఎండీ, యాదాద్రి భువనగిరి కలెక్టర్ ఇందుకు సంబంధించిన అన్ని అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ