ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు ఆగస్టు 6, శుక్రవారం సాయంత్రం 5 గంటలకు విడుదల కానున్నాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో ఫలితాలను విడుదల చేయనున్నట్టు పరీక్షల నిర్వహణ డైరెక్టర్ తెలిపారు. అనంతరం ఫలితాలను www.bse.ap.gov.in వెబ్సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఫలితాలకు సంబంధించి మార్గదర్శకాల రూపకల్పన కోసం హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇటీవలే హైపవర్ కమిటీ సిఫార్సులకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం, అందుకు అనుగుణంగా పదో తరగతి ఫలితాల విడుదలపై అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ