దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 25166 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 154 రోజుల్లో నమోదైన రోజువారీ కరోనా కేసుల్లో ఇదే తక్కువ. అలాగే వరుసగా 51 రోజులుగా 50 వేలలోపే కేసులు నమోదవుతున్నాయి. ఇక ఇప్పటివరకు దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,22,50,679 కు చేరుకుంది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 437 మంది మరణించడంతో మరణాల సంఖ్య 4,32,079 కి పెరిగింది. ప్రస్తుతం 3,69,846 (1.15%) మంది కరోనా బాధితులు హోం ఐసోలేషన్ లలో, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
గత 24 గంటల్లో కొత్తగా కేరళ (12,294), మహారాష్ట్ర (4,145), తమిళనాడు (1,851), కర్ణాటక (1,065), ఆంధ్రప్రదేశ్ (909), ఒడిశా (868), అస్సాం (758), వెస్ట్ బెంగాల్ (502), తెలంగాణ (405), మేఘాలయ (352) వంటి 10 రాష్ట్రాల్లోనే కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. ఇక దేశంలో మరో 36,830 మంది బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి సంఖ్య 3,14,48,754 (97.51%) కు చేరుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ