రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలకు అర్హులైన ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించి ప్రభుత్వానికి పంపేందుకు బీజేపీ కరీంనగర్ జిల్లా శాఖ చేపట్టిన ‘దరఖాస్తుల ఉద్యమాన్ని’ ప్రారంభించడం జరిగిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ హామీలను అమలయ్యేలా ఒత్తిడి తీసుకొచ్చి, తెలంగాణ ప్రజలకు మేలు చేకూర్చడమే ఈ ఉద్యమం ప్రధాన ఉద్దేశమని ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ దరఖాస్తుల ఉద్యమాన్ని చేపడుతున్నామే తప్ప రాజకీయ లబ్ధి కోసం కాదని బండి సంజయ్ ట్వీట్ లో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో బండి సంజయ్ చేసిన దరఖాస్తుల ఉద్యమం ట్వీట్ పై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. బండి సంజయ్ ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ, “ప్రధాని మోదీ ఇచ్చిన వాగ్దానం ప్రకారం ప్రతి పౌరుడికి రూ. 15 లక్షల కోసం దరఖాస్తులను ఆహ్వానించడానికి తెలంగాణ బీజేపీ తీసుకున్న ఈ చర్యను నేను స్వాగతిస్తున్నాను. ఈ ప్రయోజనాన్ని ధనదాన్ గా వారి జనధన్ ఖాతాలలో పొందడం కోసం అర్హులైన తెలంగాణ వాసులందరూ తమ దరఖాస్తులను బీజేపీ నాయకులకు పంపాలని కోరుతున్నాను” అంటూ మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ