టోక్యో పారాలింపిక్స్-2020 ఆగస్టు 24 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ పారాలింపిక్స్లో భారత మహిళా టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవీనా పటేల్ అత్యుత్తమ ప్రదర్శనతో ఫైనల్ కు చేరుకుంది. శనివారం నాడు మహిళల టేబుల్ టెన్నిస్ క్లాస్ -4 సింగిల్స్ విభాగం సెమీఫైనల్లో భవినా సంచన విజయం సాధించింది. చైనాకు చెందిన ప్రపంచ నెం.3 ర్యాంకు క్రీడాకారిణి జాంగ్ మియావోపై 3-2 తేడాతో విజయం సాధించి, పారాలింపిక్స్లో భారత్ కు పతకాన్ని ఖరారు చేసింది. అలాగే పారాలింపిక్స్లో టేబుల్ టెన్నిస్ ఈవెంట్లో ఫైనల్ లోకి ప్రవేశించిన మొదటి భారతీయురాలిగా భవీనా పటేల్ చరిత్ర సృష్టించింది.
ఇక ఆగస్టు 29న జరిగే ఫైనల్లో స్వర్ణ పతకం కోసం ప్రపంచ నంబర్ వన్ చైనీస్ ప్యాడ్లర్ ఇంగ్ ఝౌతో భవీనా పటేల్ తలపడనుంది. సెమీస్ అనంతరం భవీనా పటేల్ మాట్లాడుతూ, పెద్ద విజయం సాధించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. చైనాను ఓడించడం కష్టమని అందరూ అంటున్నారని, ఈ రోజు తాను అసాధ్యమైనది ఏమీ లేదని నిరూపించానన్నారు. భారతీయులందరి దీవెనలతో రేపు ఫైనల్ మ్యాచ్ లో కూడా మెరుగైన ప్రదర్శన చేస్తాను అని భవీనా పటేల్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ