జీహెఛ్ఎంసీ పరిధిలో మలక్పేట నియోజకవర్గంలోని సైదాబాద్ లో పిల్లిగుడిసెల వద్ద పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.24.91 కోట్లతో నిర్మించిన 288 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను శనివారం నాడు రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మహమూద్ అలీతో కలిసి రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, 288 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందుకోబోతున్న లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే బలాల, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పలుమార్లు సీఎం కేసీఆర్ ను కలిసి ఈ ప్రాంతంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, రహదారుల విస్తరణ, డ్రైనేజీ, మంచినీటి సౌకర్యంపై విజ్ఞప్తి చేశారని తెలిపారు.
గత ఏడేళ్లుగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో బహుముఖమైన అభివృద్ధి జరుగుతుందని, పాతనగరం కొత్తనగరం అనే తేడాలేకుండా అంతటా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఇక జంగంమెట్, బండ్లగూడ, ఫారూఖ్నగర్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసి, ప్రజలకు అందిస్తామన్నారు. మరోవైపు చంచల్గూడ జైలును తరలింపుపై స్థానిక ఎమ్మెల్యే బలాల, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి చేశారని, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ