హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనాల శోభాయాత్ర కొనసాగుతుంది. నిమజ్జనాల సందడితో రహదారులన్నీ జనంతో నిండిపోతున్నాయి. ఇక ప్రతి సంవత్సరం అందరిలోనూ ఆసక్తి కలిగించే బాలాపూర్ లడ్డూ వేలం పాట ఈసారి కూడ అంతే ఆకర్షణీయంగా నిలిచింది. బాలాపూర్ లడ్డూ వేలం పాట ఆదివారం ఉదయం ముగిసింది. బాలాపూర్ లో జరిగిన వేలంపాట కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఇతర నాయకులు హాజరయ్యారు. వేలంపాటలో పలువురు భక్తులు పాల్గొనగా, మరోసారి రికార్డ్ స్థాయి ధర పలికింది. ఆంధ్రప్రదేశ్ లోని కడపకు చెందిన ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్తో కలిపి నాదర్గుల్ చెందిన మర్రి శశాంక్రెడ్డి లడ్డూను రూ.18.90 లక్షలకు సొంతం చేసుకున్నారు. 2019లో కొలను రామిరెడ్డి అనే వ్యక్తి రూ.17.60 లక్షలకు లడ్డూను సొంతం చేసుకోగా, గతేడాది కరోనా కారణంగా లడ్డూ వేలం పాట రద్దయింది. 2018లో బాలాపూర్ లడ్డూ రూ.16.60 లక్షల ధర పలకింది.
1994 నుంచి బాలాపూర్ లో లడ్డును వేలం పాట కొనసాగిస్తున్నారు. అప్పటినుంచి మొదలు ప్రతి సంవత్సరం రేటు పెరుగుతూనే వస్తుంది. ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో ఉండాలని బాలాపూర్ లడ్డూ వేలంలో పాల్గొన్నట్టు తెలిపారు. శశాంక్రెడ్డితో కలిసి లడ్డూను దక్కించుకున్నానని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బాలాపూర్ లడ్డూను కానుకగా అందించనున్నట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ