ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన గురువారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా అమ్మ ఒడి పథకం అమలు, సినిమా టిక్కెట్ల విక్రయంకై ఆన్లైన్ పోర్టల్, దేవాదాయ శాఖ చట్ట సవరణలు, రాష్ట్రవ్యాప్తంగా గుట్కా నిషేధంపై చట్ట సవరణ, కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం, అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేకశాఖ ఏర్పాటు, ఏపీ హైగ్రేడ్ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు కోసం భూముల సేకరణకు సంబంధించి నష్టపరిహారం చెల్లింపు, వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీ, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ సహా రాష్ట్రంలో అమలు చేయనున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలుపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించనున్నట్లు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ