ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో భేటీ కానున్నారు. గురువారం సాయంత్రం రాజ్ భవన్ లో గవర్నర్ ను సీఎం వైఎస్ జగన్ మర్యాదపూర్వకంగా కలువనున్నారు. ఈ భేటీ సందర్భంగా నవంబర్ 1న జరిగే వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని గవర్నర్ ను ఆహ్వానించడంతో పాటుగా, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, సంక్షేమ పథకాల అమలు సహా పలు ఇతర అంశాలపై వారివురూ చర్చించే అవకాశమునట్టు సమాచారం.
అలాగే నవంబర్ 17వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఈ రోజు జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సమావేశాలు నిర్వహణ, బిల్లుల ఆమోదం, చర్చ అంశాలపై కూడా సీఎం వైఎస్ జగన్ గవర్నర్ తో చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ