ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఉదయం వారణాసికి విచ్చేసిన ప్రధాని మోదీ కి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. అనంతరం, వారణాసిలోని ప్రముఖ కాలభైరవ ఆలయాన్ని సందర్శించిన మోదీ కాలభైరవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానికి వచ్చిన ప్రజలకు ఆయన అభివాదం చేశారు. పవిత్ర కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్ ప్రారంభించటానికి వారణాసి వచ్చారు మోదీ.
1669 లో విశ్వనాథుడి ఆలయ పునరుద్ధరణ పనులు జరగగా, మరలా ఇప్పుడు 350 సంవత్సరాల తర్వాత మోదీ ఆధ్వర్యంలో మరోసారి జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి, లోక్ సభ స్పీకర్, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ మఠాలకు చెందిన 3వేల మంది సాధువులు, మత పెద్దలు, కళాకారులు, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు పాల్గొంటున్నారు. అనంతరం, గంగానదిపై క్రూయిజ్ లో విహారం చేయనున్న ప్రధాని మోదీ, విశిష్ట గంగా హారతిని కూడా అక్కడినుంచే దర్శించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ