ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్

janasena chief pawan kalyan, Janasena Latest News, Mango News, pawan kalyan, Pawan Kalyan Deeksha, Pawan Kalyan Deeksha At Mangalagiri, Pawan Kalyan live, Pawan Kalyan Made Sensational Comments, Pawan Kalyan Made Sensational Comments On The AP government, Pawan Kalyan Speech, Pawan Kalyan takes dig at AP govt, Pawan Kalyan Vizag Steel Plant Protest, Visakha Steel Plant, Visakhapatnam, Vizag Steel Plant, Vizag Steel Plant Privatisation

ఏపీ ప్రభుత్వంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైజాగ్ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా.. ఆయన మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేశారు. సాయంత్రం దీక్ష విరమణ అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ప్రభుత్వానికి 500 మంది సలహాదారులు ఉన్నారని, ఒక్కరు కూడా మంచి సలహాలు ఇవ్వటం లేదని ఆయన అన్నారు.

నా సినిమాలను ఆపేసి, నా ఆర్ధిక మూలలను దెబ్బ కొట్టాలని చూస్తున్నారని.. నన్ను భయపెట్టాలని చూస్తే భయపడేది లేదు అని ఆయన అన్నారు. పంతానికి వస్తే, రాష్ట్రమంతా నా సినిమాను ఫ్రీ గా రిలీజ్ చేస్తాను అని పవన్ కళ్యాణ్ సవాల్ చేశారు. మద్యం 700 రూపాయలకి అమ్ముతూ, సినిమా టిక్కెట్లు మాత్రం 5 రూపాయలకు అమ్ముతారంట అని ఎద్దేవా చేశారు. చట్ట సభలోనే ప్రతిపక్ష నాయకుడిని, ఆయన సతీమణిని తిడుతుంటే, ఇక రోడ్డుమీద వెళ్లే ఆడపిల్లల పరిస్థితి ఏంటని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని.. ఉత్తర ప్రదేశ్, బీహార్ కంటే ఘోరంగా ఉన్నాయని అయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడితప్పిందని అయన విమర్శించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =