దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 7,189 కరోనా కేసులు నమోదవడంతో డిసెంబర్ 25, శనివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,47,79,815 చేరుకుంది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 387 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,79,520 కి పెరిగింది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ, జమ్మూ అండ్ కశ్మీర్, ఆంధ్రప్రదేశ్, అస్సాం వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
దేశంలో 77032 యాక్టీవ్ కరోనా కేసులు, 579 రోజుల్లో ఇదే తక్కువ:
దేశంలో ప్రస్తుతం 77032 (0.22%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. దీంతో 579 రోజుల కనిష్ట స్థాయికి యాక్టీవ్ కేసులు చేరుకున్నాయి. ఇక కొత్తగా 7,286 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 3,42,23,263 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 98.40 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.38 శాతంగా ఉంది. అలాగే డిసెంబర్ 24, శుక్రవారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 67,10,51,627 కు చేరుకుంది. డిసెంబర్ 24న 11,12,195 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ