తెలంగాణ విద్యుత్ శాఖా మంత్రి జగదీశ్రెడ్డి కరోనా బారిన పడ్డారు. ఒంట్లో కొంచెం నలతగా ఉండటంతో.. ఆయన సోమవారం రాత్రి హైదరాబాద్లో కరోనా పరీక్ష చేయించుకున్నారు. యాంటిజెన్ టెస్టులో నెగెటివ్ రాగా మంగళవారం ఉదయం వచ్చిన ఆర్టీపీసీఆర్ టెస్టు రిపోర్టులో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో.. హైదరాబాద్లోని తన నివాసంలోనే హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నారు. ప్రస్తుతం కొద్దిపాటి జలుబు, గొంతునొప్పి లక్షణాలతో ఇబ్బంది పడుతున్న జగదీశ్రెడ్డి, డాక్టర్ల సూచనల మేరకు చికిత్స పొందుతున్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచించారు. అయితే, మంత్రి జగదీశ్రెడ్డి ఆరోగ్యం విషయంలో ఆందోళన పడాల్సిందేమీ లేదని.. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నట్లు మంత్రి సన్నిహితులు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ