ఇండోనేషియా రాజధానిని మార్చబోతున్నారు. ఇండోనేషియాకు ‘జకార్తా’ నగరం ఇప్పటివరకు రాజధానిగా ఉంది. ఇండోనేషియా పార్లమెంట్ మంగళవారం అధికారికంగా జాతీయ రాజధానిని జకార్తా నుండి బోర్నియో ఐలాండ్ లోని ‘తూర్పు కాలిమంటన్’ కు మార్చడానికి ఆమోదం తెలిపింది. “రాజధాని నగరాన్ని తూర్పు కాలిమంటన్కు మార్చడం అనేక పరిగణనలు, ప్రాంతీయ ప్రయోజనాలు మరియు సంక్షేమం మీద ఆధారపడి ఉంది” అని ఇండోనేషియా మంత్రి సుహార్సో మోనోఆర్ఫా అన్నారు.
ఇండోనేషియా కొత్త రాజధానిగా మారబోతున్న తూర్పు కాలిమంటన్ ప్రాంతానికి కొత్తగా ‘నుసంతరా’ అని పేరు పెట్టారు. నుసంతరా అంటే.. వారి భాషలో “ద్వీప సమూహం” అని అర్ధం. ఇది జావా ద్వీపంలోని ప్రస్తుత రాజధాని జకార్తాకు 2 వేల కి.మీ దూరంలో ఉంది. ఐతే, నూతన రాజధాని నుంచి పరిపాలన చేయనున్నా.. పాత రాజధాని జకార్తా మాత్రం ప్రముఖ ఆర్ధిక, వాణిజ్య కేంద్రంగా ఉంటుందని ఇండోనేషియా ప్రభుత్వం తెలియజేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF