ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 ఆసక్తికరంగా సాగుతున్న తెలిసిందే. అయితే పలు కారణాల దృష్ట్యా పలువురు ఆటగాళ్లు తమ జట్లకు దూరమవుతున్నారు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ దీపక్ చాహర్ వెన్ను గాయం కారణంగా ఐపీఎల్-2022 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ మేరకు ఐపీఎల్ టోర్నీ నిర్వాహకులు ఒక ప్రకటన విడుదల చేశారు. 2022 మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ రూ.14 కోట్లకు దీపక్ చాహర్ ను కొనుగోలు చేసింది. అయితే గాయం కారణంగా కనీసం ఒక్క మ్యాచ్లో కూడా దీపక్ చాహర్ ఆడలేకపోయాడు. జట్టులో కీలక బౌలర్ గా ఉన్న దీపక్ చాహర్ సీజన్ మొత్తానికి దూరం కావడంతో జరగబోయే మ్యాచుల్లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ విజయావకాశాలపై కొంతమేర ప్రభావం చూపనుంది.
మరోవైపు మిగిలిన ఐపీఎల్-2022 సీజన్ కు గానూ పేసర్ రసిఖ్ సలామ్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రానా కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టులో చేరనున్నాడు. ఈ మేరకు హర్షిత్ రానాతో కేకేఆర్ ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు. ఈ సీజన్లో కేకేఆర్ కోసం 2 మ్యాచ్ లు ఆడిన సలామ్ వెన్నుముకలో గాయం కారణంగా దూరమవడంతో ఇకపై టోర్నమెంట్లో పాల్గొనే అవకాశం లేదని, అతని స్థానంలో ఢిల్లీకి చెందిన హర్షిత్ రానా కనీస ధర రూ.20 లక్షలతో కేకేఆర్ జట్టులో చేరతాడని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ