దేశంలో రోజురోజుకి కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 3,37,704 కరోనా పాజిటివ్ కేసులు, 488 మరణాలు నమోదయ్యాయి. దీంతో జనవరి 21, శనివారం ఉదయం 8 గంటల నాటికీ కరోనా కేసుల సంఖ్య 3,89,03,731 కు, మరణాల సంఖ్య 4,88,884 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక రోజువారీ పాజీటివిటీ రేటు 17.22 శాతంగా నమోదవగా, వీక్లి పాజీటివిటీ రేటు 16.65 శాతంగా ఉంది.
అలాగే దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో 2,42,676 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 3,63,01,482 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 93.31 శాతం గానూ, మరణాల రేటు 1.26 శాతంగా ఉంది. కాగా ప్రపంచంలో ఎక్కువ కరోనా కేసులు నమోదైన దేశాల్లో భారత్ రెండో స్థానంలో, కరోనా మరణాలు ఎక్కువుగా నమోదైన దేశాల్లో మూడో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో ప్రస్తుతం 21,13,365 (5.43%) మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు దేశంలో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 10,050 కు చేరుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్నటితో పోలిస్తే ఒమిక్రాన్ కేసుల నమోదు 3.69 శాతం పెరిగిందని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF