దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా కొనసాగుతోంది. గత మూడు రోజులుగా 5 వేలకు పైనే కొత్త కేసులు నమోదవుతుండటం కొంత ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. 24 గంటల వ్యవధిలో కొత్తగా 5,676 మంది కరోనా బారిన పడ్డారు. కాగా సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 1,96,796 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగ వీరికి కోవిడ్-19 పాజిటివ్గా తేలింది. దీంతో ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 37వేలు మార్క్ దాటాయి. అత్యధికంగా కేరళలో 13,745, మహారాష్ట్రలో 4,667 యాక్టివ్ కేసులు ఉండగా.. మిగిలిన రాష్ట్రాల్లో వెయ్యి, 2వేలు లోపు కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే దేశవ్యాప్తంగా 15మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
దేశంలో కరోనా కేసులు వివరాలు (2023, ఏప్రిల్ 11, ఉదయం 8 గంటల వరకు):
- ఏప్రిల్ 10న నిర్వహించిన కరోనా పరీక్షలు : 1,96,796
- కొత్తగా నమోదైన కేసులు [ఏప్రిల్ 10–ఏప్రిల్ 11 (8AM-8AM)] : 5,676
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,47,51,259
- కొత్తగా కోలుకున్నవారి సంఖ్య : 3,761
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 4,42,00,079
- కరోనా రికవరీ రేటు : 98.73 శాతం
- యాక్టీవ్ కేసులు : 37,093
- కొత్తగా నమోదైన మరణాలు : 15
- మొత్తం మరణాల సంఖ్య : 5,31,000
- మొత్తం కరోనా వ్యాక్సిన్ డోసులు: 220.66 (220,66,23,885) కోట్లు పంపిణీ.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE