ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 ఆటగాళ్ల మెగా వేలం ప్రక్రియ ఫిబ్రవరి రెండో వారంలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2022 వేలం కోసం ఆటగాళ్ల పేర్ల నమోదుకు తుది గడువు జనవరి20, 2022 తో ముగిసింది. దీంతో ఈ వేలం కోసం మొత్తం 1,214 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నట్టు వెల్లడించారు. పేర్లు నమోదు చేసుకున్న ఆటగాళ్లలో 896 మంది భారతీయ ఆటగాళ్లు కాగా, 318 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.
ఈ 1,214 మంది ఆటగాళ్ళలో 270 మంది తమ దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్ళు కాగా (క్యాప్డ్ ప్లేయర్లు), 903 మంది ఇప్పటివరకు దేశానికి ప్రాతినిధ్యం వహించని ఆటగాళ్లు (అన్క్యాప్డ్ ప్లేయర్లు) మరియు 41 మంది అసోసియేట్ దేశాల క్రికెటర్లు ఉన్నారు. వేలానికి అందుబాటులో ఉన్న భారత్ ఆటగాళ్లలో 61 మంది జాతీయ జట్టుకు ఆడగా, 692 మంది ఇంతవరకు భారత్ జట్టు తరఫున ఆడలేదు. మిగిలిన 143 మంది ఇప్పటికే ఒక ఐపీఎల్ మ్యాచ్ అయినా ఆడి ఉన్నారు. ఫిబ్రవరిలో జరిగే ఈ మెగా వేలంలో మొత్తం 10 ప్రాంఛైజీలు కలిపి 217 మంది ఆటగాళ్లను తీసుకోనున్నారు. మరోవైపు వేలానికి ముందే మొత్తం 33 మంది ఆటగాళ్లు రిటైన్ చేయబడ్డారు. ఇప్పటికే ఉన్న 8 ఐపీఎల్ ఫ్రాంచైజీలు మొత్తం 27 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా, 2 కొత్త ఐపీఎల్ జట్లు (అహ్మదాబాద్, లక్నో) వేలానికి ముందు ముగ్గురి చొప్పున 6 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF