ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు (ఏప్రిల్ 24, ఆదివారం) జమ్మూ కాశ్మీర్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం 11:30 గంటలకు జమ్మూ కాశ్మీర్ లో జరిగే జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవ వేడుకలో ప్రధాని పాల్గొననున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని గ్రామసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే సాంబ జిల్లాలోని పల్లి పంచాయతీని ప్రధాని మోదీ సందర్శించనున్నారు. అనంతరం దాదాపు రూ.20,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అమృత్ సరోవర్ కార్యక్రమాన్ని కూడా ప్రధాని ప్రారంభించనున్నారు.
మరోవైపు ఈ పర్యటన అనంతరం, ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముంబయిలో జరిగే మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ప్రధాని హాజరవుతారు. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ప్రధాని మోదీ తోలి లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డును ప్రధాని మోదీ అందుకోనున్నారు. ఈ అవార్డును ప్రముఖ గాయని, భారతరత్న లతా మంగేష్కర్ స్మృత్యర్థం ఏర్పాటు చేయగా, ఏటా ఈ అవార్డును దేశనిర్మాణానికి విశేష కృషి చేసిన వ్యక్తికి బహుకరించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ