నేడు కరీంనగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో రూ.615 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించడం, శంకుస్థాపనలు చేయడం వంటి కార్యక్రమాలలో మంత్రి పాల్గొననున్నారు. జిల్లాలో ప్రధానమైన రూ.410 కోట్లతో నిర్మించనున్న మానేరు రివర్ఫ్రంట్ పనులకు శంకుస్థాపన చేయడం, 24 గంటల తాగు నీటిసరఫరా పైలట్ ప్రాజెక్టు పనులు సహా వివిధ కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొనున్నారు. పట్టణంలో డంప్ యార్డుల తొలగింపు, నగరంలోని ఐలాండ్స్ ఆధునీకరణ, ప్రధాన రోడ్ల నిర్మాణం వంటి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అలాగే జిల్లాలోని చొప్పదండిలో సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం, సాయంత్రం మున్సిపాలిటీ చైర్మన్లతో మంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. చివరిగా కరీంనగర్లోని మార్క్ఫెడ్లో జరగనున్న బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ