మార్చి 16, బుధవారం నాడు దేశవ్యాప్తంగా 12 మరియు 14 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు/టీనేజర్ల కూడా కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన విషయం తెలిసిందే. 12-14 సంవత్సరాల వయసు వారికీ హైదరాబాద్ కు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ బయోలాజికల్-ఇ లిమిటెడ్ రూపొందించిన “కోర్బెవాక్స్” కోవిడ్ వ్యాక్సిన్ ను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేటగిరి కింద గత 24 గంటల్లో 3 లక్షల మందికిపైగా (3,00,405) పిల్లలకు తోలి డోస్ వ్యాక్సిన్ వేసినట్టు గురువారం నాడు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తోలి డోస్ తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోస్ వ్యాక్సిన్ వేయనున్నారు.
మరోవైపు మార్చి 17, గురువారం ఉదయం 7 గంటల వరకు దేశంలో లబ్ధిదారులకు అందించిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 180.80 కోట్లు (1,80,80,24,147) దాటినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక ప్రికాషన్ డోస్ కోవిడ్-19 వ్యాక్సినేషన్ కింద ఇప్పటివరకు 43,40,771 మంది హెల్త్కేర్ వర్కర్స్, 66,23,571 మంది ఫ్రంట్లైన్ వర్కర్స్ మరియు 60 ఏళ్లు పైబడినవారు 1,05,89,031 కలిపి మొత్తం 2,15,53,373 మందికి వ్యాక్సిన్ అందించినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ