ఈరోజు 13 రాష్ట్రాల పరిధిలోని పలు సమస్యల కారణంగా భారతీయ రైల్వే 273 రైళ్లను రద్దు చేసింది. IRCTC వెబ్సైట్ ప్రకారం, ఈ రోజు బయలుదేరాల్సిన 253 రైళ్లు పూర్తిగా రద్దు చేయబడ్డాయి, ఇంకో 20 రైళ్లు పాక్షికంగా రద్దు చేయబడ్డాయి. ఆపరేషనల్ మరియు నిర్వహణ పాయింట్ల వద్ద ఎదుర్కొంటున్న కొన్ని సమస్యల కారణంగా 273 రైళ్లను రద్దు చేసినట్లు భారతీయ రైల్వే తెలిపింది. ఈ జాబితాలో.. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, గుజరాత్, తెలంగాణ మరియు అస్సాం రాష్ట్రాల పరిధిలోని రైళ్లు ఉన్నాయి. రద్దయిన రైళ్ల జాబితా రైల్వే జాతీయ రైలు విచారణ వ్యవస్థ (NTES) వెబ్సైట్లో విడుదల చేయబడింది. రైల్వే శాఖ పెద్ద సంఖ్యలో ప్యాసింజర్, మెయిల్-ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేసింది. కాగా, ఒకేసారి ఇన్ని రైళ్లు రద్దుచేయబడటంతో ప్రయాణీకులు తీవ్ర ఇక్కట్లకు లోనవుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ