మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. శుక్రవారం లయోలా అకాడమీ 43వ కాలేజ్ డే వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కాన్రాడ్ సంగ్మా శుక్రవారం ఉదయం ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారివురూ ఇరు రాష్ట్రాలకు సంబంధించి వివిధ అంశాలపై చర్చించినట్టు తెలుస్తుంది. అలాగే ఈ భేటీ సందర్భంగా సీఎం సంగ్మా దంపతులను మంత్రి కేటీఆర్, ఆయన సతీమణి శైలిమ శాలువాతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. ఈ భేటీ వివరాలను సీఎం సంగ్మా ట్విట్టర్ లో షేర్ చేశారు.
Glad to meet my dear friend and Minister ITE & Communication Shri @KTRTRS and his wife at their residence in Hyderabad. pic.twitter.com/zQ0MkePLGD
— Conrad Sangma (@SangmaConrad) April 8, 2022
Always a pleasure meeting you dear @SangmaConrad Ji https://t.co/HUT3YYBCgW
— KTR (@KTRTRS) April 8, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ