ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నంద్యాలలో జగనన్న వసతిదీవెన రెండో విడత నిధులను విడుదల చేశారు. అనంతరం అక్కడే నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “రాష్ట్రంలో సంక్షేమంతో పాటుగా అన్ని మార్పులు మంచిగా జరుగుతుంటే చంద్రబాబుకు, ఆయన పార్టీకి, ఆయన దత్తపుత్రుడికి, ఆయన ఎల్లో మీడియాకు గాని ఇవేవి కూడా కనిపించవు. ఇవీ కనిపించకపోగా రోజుకొక కట్టుకథ, వక్రీకరణ, రోజుకొక విధంగా ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడంతా సరిపోదు అని పార్లమెంట్ లో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు పాలుజేసేందుకు బురద జల్లుతున్న గొప్ప చరిత్ర వీళ్లది. ఎక్కడైనా ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రతిష్ట పెంచాలని ఆరాటపడతాయని, కానీ వీళ్లంతా రాష్ట్ర పరువును కూడా తాకట్టు పెడుతున్నారు. ఇన్ని సమస్యలు, ఇన్ని కష్టాలు ఉన్నా కూడా ఇవేవి నన్ను కదిలించలేవు, నన్ను బెదిరించలేవు. భరోసా ఇస్తూ అందరికి ఒకటే చెప్తున్నా. దేవుడి దయతో, ప్రజల చల్లని దీవెనలతో ఈ స్థానంలోకి వచ్చాను. దేవుడి దయతో, మీ చల్లని దీవెనల ఉన్నంతవరకు వాళ్లు నా వెంట్రుక కూడా పీకలేరు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను” అని సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ