తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేడు ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి పర్యటనకు విచ్చేశారు. యాదాద్రిలోని రామలింగేశ్వర స్వామి ప్రధానాలయం పునఃప్రారంభం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సతీసమేతంగా పాల్గొన్నారు. దీనిని శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయంగా నిర్మించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మహా కుంభాభిషేక మహోత్సవాల్లో భాగంగా రామలింగేశ్వర స్వామి ప్రధానాలయం పునఃప్రారంభ వేడుకలు జరుగుతున్నాయి. ఈ పర్యటనలో భాగంగా.. సీఎం కేసీఆర్ ముందుగా ఎర్రవల్లి నుంచి రోడ్డు మార్గంలో ఆలయానికి చేరుకుని, స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా.. ముఖ్యమంత్రి దంపతులను ఆలయ అర్చకులు ఆశీర్వదించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో నిర్వహించిన మహా కుంభాబిషేక మహోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. అనంతరం నూతనంగా నిర్మించిన ఆలయాన్ని పునఃప్రారంభించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ