హైదరాబాద్ రాయదుర్గంలోని నాలెడ్జ్ సెంటర్లో ఈరోజు అమెరికాకు చెందిన కాల్అవే గోల్ఫ్ డిజిటెక్ సెంటర్ను తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విశ్వ నగరంగా హైదరాబాద్ను ప్రపంచపటంలో నిలపడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని, దీనిలో భాగంగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన సంస్థలను ఇక్కడ పెట్టుబడులు పెట్టవలసిందిగా కోరుతున్నామని తెలిపారు. దీనికి ఎన్నో సంస్థలు తమ సుముఖతను తెలుపుతున్నాయని, ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన ప్రముఖ గోల్ఫ్ సంస్థ కాల్అవే తమ కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందని వెల్లడించారు. కాల్అవే గోల్ఫ్ సంస్థ హైదరాబాద్లో రూ.150 కోట్లతో అతిపెద్ద డిజిటెక్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోందని, దీనిద్వారా సుమారు 300 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని మంత్రి తెలిపారు.
గ్లోబల్ కార్యకలాపాలకు IT బ్యాకెండ్ మద్దతును అందించే క్రమంలో తొలుత 300 మంది సాఫ్ట్వేర్ నిపుణులతో పనిచేయనుందని కేటీఆర్ వెల్లడించారు. ఇప్పటికే తెలంగాణలో డిజిటెక్ కంపెనీలు చాలా ఉన్నాయని, ఇప్పుడు ఈ సంస్థ డిజిటెక్ సెంటర్ ఏర్పాటవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఒక నెల క్రితం మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో భాగంగా.. శాండియాగో కేంద్రంగా పనిచేసే కాల్అవే సంస్థ CFO బ్రియాన్ లించ్ బృందంతో చర్చలు జరిపైన విషయం తెలిసిందే. ఇంకా అమెజాన్, ఆపిల్, గూగుల్, ఉబర్, నోవార్టిస్, ఇలా పలు ప్రసిద్ధ సంస్థలు హైదరాబాద్లో తమ కార్యాలయాలు ఏర్పాటు చేశాయని, దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాలకు సంబంధించిన కంపెనీలకు అవసరమైన వసతులను, రాయితీలను అందించటమే ప్రధాన కారణం అని చెప్పారు. అలాగే మౌలిక వసతుల కల్పనలో దేశంలోని ఇతర నగరాల కంటే హైదరాబాద్ మొదటి స్థానంలో ఉన్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ