ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా ఈరోజు విజయవాడలో ఆప్కో సమ్మర్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చేనేత కుటుంబాలకు ఎప్పుడు అండగా ఉంటానని, తాను కూడా ఒక చేనేత కుటుంబానికి కోడలినే అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించాలని, చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి నేతన్నలకు సహకరించాలని పిలుపునిచ్చారు. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు రాష్ట్రం నలుమూలలా ఆప్కో షోరూమ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమ్మర్ శారీ మేళా ద్వారా మహిళలకు 30శాతం డిస్కౌంట్ ఇస్తున్నారని, చాలా రకాల వెరైటీలు లభిస్తున్నాయని చెప్పారు. ఇక్కడి షోరూమ్ లోని పెళ్లి బట్టలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయని కితాబిచ్చారు. సీఎం జగన్ చేనేత కార్మికులకు ఆర్ధిక చేయూత ఇచ్చేందుకు ప్రత్యేక పథకాలు అందిస్తున్నారని తెలిపారు. అందుకే ప్రయివేట్ షోరూమ్లకు ధీటుగా ఆప్కో షోరూమ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావు, ఎండీ నాగరాణి తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ