తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు హయత్ నగర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ముందుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున నాగోల్లోని బండ్లగూడలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో అమరుల యాదిలో అనే పేరుతో సభ జరిగింది. ఈ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ను, ప్రభుత్వ పథకాలను కించపరిచేలా ఓ స్కిట్ ప్రదర్శించినట్లు ఆరోపణలు రావడంతో, ఈ వ్యవహారంలో నాలుగు రోజుల క్రితం బీజేపీ నాయకుడు జిట్టా బాలకృష్ణా రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఆయన అదే రోజున బెయిల్ పై విడుదల అయ్యారు. తాజాగా ఆ స్కిట్ విషయంలో మంగళవారం రాణి రుద్రమ, దరువు ఏలన్నను కూడా హయత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే బండి సంజయ్ కి కూడా 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసినట్టు హయత్ నగర్ పోలీసులు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY