హైదరాబాద్ నగరంలో నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా నేడు (డిసెంబర్ 31, శనివారం) హైదరాబాద్ మెట్రో రైల్ సాధారణ పనివేళలలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. చివరి మెట్రో రైళ్లు నేడు అర్ధరాత్రి 1 గంటకు సంబంధిత స్టేషన్ల నుండి బయలుదేరతాయని మరియు సంబంధిత టెర్మినేటింగ్ స్టేషన్లకు 2 గంటలకు చేరుకుంటాయని చెప్పారు.
“నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా 2022, డిసెంబర్ 31 నాడు మీరు ఇంటికి వెళ్లేందుకు సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన ప్రయాణాన్ని కలిగి ఉండేలా హైదరాబాద్ మెట్రో రైల్ ఏర్పాట్లు చేస్తుంది. ప్రారంభ స్టేషన్స్ లో చివరి మెట్రో రైళ్లు డిసెంబర్ 31 అర్థరాత్రి 1 గంట నుంచి (జనవరి 1, 1 AM) నుండి బయలుదేరుతాయి, అలాగే గమ్యస్థానాలకు 2 గంటలకు చేరుకుంటాయి. ఈ నేపథ్యంలో ప్రయాణీకులు హైదరాబాద్ మెట్రో రైలు భద్రతా సిబ్బంది మరియు ఇతర సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం” అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE