తెలంగాణ రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఎన్నికలను వెంటనే నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జనవరి 29, బుధవారం నాడు సంబంధిత అధికారులను ఆదేశించారు. పీఏసీఏస్లకు నియమించిన పర్సన్ ఇన్చార్జ్ల పదవీకాలం ముగుస్తున్నందున మూడు, నాలుగు రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు. పీఏసీఎస్ సంబంధించిన మొత్తం ఎన్నికల ప్రక్రియను 15 రోజుల్లోగా పూర్తి చేయాలని, పీఏసీఏస్లకు కొత్త పాలక మండళ్లను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పీఏసీఎస్ లపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో పీఏసీఎస్ లకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది.
[subscribe]