ఆంధ్రప్రదేశ్ లో సీనియర్‌ ఐఏఎస్‌లకు పదోన్నతులు

Andhra Pradesh Latest News, Ap Political Live Updates, Ap Political News, AP Political Updates, AP Political Updates 2020, AP Senior IAS Officers Got Promotions, Mango News Telugu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ జనవరి 29, బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్య కార్యదర్శులకు ప్రధాన కార్యదర్శులుగా, కార్యదర్శులను ముఖ్యకార్యదర్శులుగా మరియు సంయుక్త కార్యదర్శులుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ప్రస్తుతం ప్రిన్సిపల్‌ సెక్రటరీలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న రజత్‌ భార్గవ్‌, జవహర్‌రెడ్డి, అనంతరాము, ప్రవీణ్‌కుమార్‌ లకు స్పెషల్‌ చీఫ్ సెక్రటరీలుగా పదోన్నతి కల్పించారు. సెక్రటరీ హోదాలో ఉన్న జి.జయలక్ష్మి, ఉషారాణి, రామ్‌గోపాల్‌కు ప్రిన్సిపల్‌ సెక్రటరీలుగా పదోన్నతి లభించింది. అలాగే జాయింట్‌ సెక్రటరీలుగా ఉన్న ముత్యాలరాజు, బసంత్‌కుమార్‌ కూడా పదోన్నతి పొందారు.
మరోవైపు ఇంటర్‌ క్యాడర్‌ ట్రాన్స్‌ఫర్ల ద్వారా నాగాలాండ్‌, యూపీ క్యాడర్‌కు చెందిన ఇద్దరు ఐఏఎస్‌లు మంజిర్‌ జిలానీ సమూన్‌, తమీమ్‌ అన్సారియా ఆంధ్రప్రదేశ్ కు బదిలీ అవ్వగా, వారికీ విశాఖలో పోస్టింగ్‌ ఇచ్చారు. వీఎంఆర్డీఏ అదనపు కమిషనర్‌గా మంజిర్‌ జిలానీ సమూన్‌, జీవీఎంసీ అదనపు కమిషనర్‌గా తమీమ్‌ అన్సారియాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 15 =