కామన్ వెల్త్ గేమ్స్-2022 లో భారత్ అథ్లెట్స్ మరో ఘనత సాధించారు. లాన్ బౌల్స్ గేమ్ లో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టిస్తూ స్వర్ణ పతాకాన్ని కైవసం చేసుకుంది. కామన్ వెల్త్ గేమ్స్లో లాన్ బౌల్స్ లో భారత్ స్వర్ణం గెలుచుకోవడం ఇదే తొలిసారి. మహిళల ఫోర్స్ విభాగం ఫైనల్లో లవ్లీచౌబే, పింకీ, నయన్ మోని, రూపా రాణి టిర్కీలతో కూడిన భారత లాన్ బౌల్స్ బృందం 17-10తో దక్షిణాఫ్రికా జట్టుపై ఘన విజయం సాధించింది. ఈ ఈవెంట్లో గతంలో దక్షిణాఫ్రికా 3 సార్లు కామన్ వెల్త్ గేమ్స్ ఛాంపియన్గా నిలిచింది. ముందుగా మహిళల ఫోర్స్ ఈవెంట్లో న్యూజిలాండ్ జట్టును 16-13 ఓడించి ఫైనల్ చేరుకున్న భారత్ క్వార్టెట్, తుదిపోరులో దక్షిణాఫ్రికాపై విజయంతో స్వర్ణ పతాకాన్ని సొంతం చేసుకుంది. దీంతో కామన్ వెల్త్ గేమ్స్లో ఇప్పటివరకు భారత్ ఖాతాలో 10 (4 స్వర్ణ, 3 రజత, 3 కాంస్య) పతకాలు చేరాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY