రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) క్రెడిట్ కార్డ్ రూల్స్ సవరించింది. ఈ సవరించిన రూల్స్ నేటి (జూలై 1) నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది. ఇవి షెడ్యూల్డ్ బ్యాంకులకు (చెల్లింపు బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులు మరియు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు మినహా) వర్తిస్తాయి. అలాగే ఇవి క్రెడిట్, డెబిట్ మరియు కో-బ్రాండెడ్ కార్డ్లకు సంబంధించిన ఈ ఆదేశాలు భారతదేశంలో పనిచేస్తున్న ప్రతి బ్యాంకుకు వర్తిస్తాయి” అని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో క్రెడిట్ కార్డ్ వాడుతున్న వారు తప్పక తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు..
- కస్టమర్ క్రెడిట్ కార్డు కోరినప్పుడు బ్యాంకులు తిరస్కరిస్తే, కార్డు తిరస్కరించడానికి గల కారణాలను రాతపూర్వకంగా కస్టమర్కు వెల్లడించాల్సి ఉంటుంది.
- క్రెడిట్ కార్డ్ పోగొట్టుకున్నా, లేక మోసాలకు గురైనా ఇన్స్యూరెన్స్ కవర్ పొందే ఆప్షన్ అందించాలి.
- కస్టమర్ల అనుమతి లేకుండా బ్యాంకులు క్రెడిట్ కార్డుల్ని అప్గ్రేడ్ చేయకూడదు.
- అయాచిత కార్డ్లను జారీ చేయడం లేదా కార్డ్లను అయాచితంగా అప్గ్రేడ్ చేయడం వంటివి చేయరాదు.
- ఒకవేళ అలా చేసినట్లైతే.. కార్డ్-జారీ చేసినవారు రివర్స్ ఛార్జీలతో పాటు దాని విలువ కంటే రెట్టింపు జరిమానాను కూడా చెల్లించాలి.
- క్రెడిట్ కార్డ్-జారీ చేసేవారు ఏడు పనిదినాల్లోగా కార్డ్ను క్లోజ్ చేయడం కోసం కస్టమర్ల రిక్వెస్ట్లకు సత్వరమే స్పందించాలి.
- దీని కోసం ప్రత్యేకంగా హెల్ప్లైన్, ఈ మెయిల్ ఐడీ, వెబ్సైట్, మొబైల్ యాప్స్లో లింక్స్ ఏర్పాటు చేయాలి.
- సకాలంలో క్రెడిట్ కార్డుని క్లోజ్ చేయని పక్షంలో, ఖాతాలో ఎలాంటి బకాయిలు లేనట్లయితే, కార్డు మూసివేయబడే వరకు జారీచేసేవారు తప్పనిసరిగా కార్డు హోల్డర్కు రోజుకు రూ. 500 చొప్పున జరిమానా చెల్లించాలి.
- బ్యాంకులు క్రెడిట్ కార్డ్హోల్డర్లకు ఛార్జీలు, వడ్డీ లెక్కింపుల గురించి ముందుగానే స్పష్టంగా వివరించాలి.
- కస్టమర్ల అనుమతి లేకుండా రుణాలు లేదా ఇతర క్రెడిట్ సౌకర్యాలు కల్పించకూడదు.
- దీనిని అతిక్రమిస్తే వాటిని వెంటనే ఉపసంహరించుకోవడంతో పాటు కొంత జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
- ఒకవేళ కస్టమర్ డిఫాల్ట్ అయితే, దానిని గూర్చి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీకి నివేదించే ముందు కస్టమర్లకు ఏడు రోజుల నోటీసు వ్యవధిని జారీ చేయాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ