రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగంపై దృష్టి సారించాలని ఆదేశించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు శుక్రవారం ఆయన వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వ్యవసాయ శాఖకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించిన కీలక సూచనల్లో కొన్ని ముఖ్యమైనవి..
- రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని, దీనిలో ఎలాంటి లాపాలకు తావీయరాదని ఆదేశం.
- ఆర్బీకేలల్లో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ నుంచి ప్రతి రోజూ నిరంతరం సమాచారం తెప్పించుకోవాలి.
- విత్తనాల సరఫరా, ఎరువుల పంపిణీ తదితర అంశాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి.
- అలాగే వ్యవసాయ ఉత్పత్తులకు తగిన మద్దతు ధర అందేలా అధికారులు చొరవ చూపాలి.
- త్వరలో వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకంతో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన భాగస్వామ్యం కానుందని వెల్లడి.
- వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగంపై దృష్టి పెట్టి మాస్టర్ ట్రైనర్లను తయారు చేయాలి.
- ఇంకా డ్రోన్ల నిర్వహణ, మరమ్మతుపై శిక్షణ ఇచ్చే దిశగా చర్యలు తీసుకోవాలి.
- నియోజకవర్గానికి ఒక ఐటీఐ కానీ, లేదా ఒక పాలిటెక్నిక్ కాలేజీలోని విద్యార్థులకు డ్రోన్ల వినియోగంపై సంపూర్ణ శిక్షణ ఇప్పించాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY