తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రెండురోజులుగా అతి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ, ఏపీలో పరిస్థితుల గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. వరద ముంపు ప్రాంతాల్లో చేపడుతున్న రెస్క్యూ మరియు రిలీఫ్ పనులలో కేంద్రం నుండి అన్ని సహాయసహకారాలు లభిస్తాయని హామీ ఇచ్చినట్టు ప్రధాని మోదీ పేర్కొన్నారు. అలాగే భారీ వర్షాల వలన ప్రభావితమైన కుటుంబాల క్షేమం కోసం ప్రార్ధిస్తున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu