2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా దేశంలోని ప్రతిపక్షాలు అన్నీ ఏకతాటిపైకి రావాలని ఆకాంక్షించారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. దీనికోసమై తనకు పెద్దసంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్షాలు ఏకమవ్వాల్సిన అవసరం ఉందని, ఈ క్రమంలో ప్రతిపక్షాల మధ్య ఐక్యత పెంపొందించడం కోసం తాను చొరవ చూపుతానని నితీష్ వెల్లడించారు. అయితే తనకు ప్రధానమంత్రి పదవిపై వ్యామోహం లేదని, ప్రధాని రేసులో కూడా తాను లేనని ఆయన స్పష్టం చేశారు.
బిహార్లో తాను చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయని, నేను నా రాష్ట్రానికి సేవ చేయాలనుకుంటున్నానని నితీశ్ కుమార్ తెలియజేశారు. అందుకే కేంద్రంలోని అధికార ఎన్డిఎకు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఐక్యతను పెంపొందించడంలో సానుకూల పాత్ర పోషించడానికి తాను ఎదురుచూస్తున్నానని అన్నారు. కాగా నితీష్ ఇటీవలే ఎన్డీఏను వీడి ఆర్జేడీ సారధ్యంలోని మహాకూటమితో చేతులు కలిపి, ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎంగా.. తాను మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF