ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారిక నివాసం ప్రగతి భవన్ లో శుక్రవారం రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. రాఖీ పండుగ సందర్భంగా ప్రేమ, ఆప్యాయతలు, సహోదర భావాలు వెల్లివిరిసాయి. సోదరీమణుల రాకతో సీఎం నివాసంలో సందడి నెలకొంది. ఇంటికి వచ్చిన తమ ఆడ బిడ్డలను సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ సాదరంగా, సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు వారి అక్కలు లలితమ్మ, లక్ష్మమ్మ, జయమ్మ, చెల్లెలు వినోదమ్మ రాఖీలు కట్టి రక్షా బంధన్ వేడుకలు జరుపుకున్నారు. రాఖీ పండుగ సందర్భంగా తనకు రాఖీలు కట్టిన అక్కలకు సీఎం కేసీఆర్ పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు తమ సోదరున్ని నిండు మనసుతో ఆశీర్వదించారు.
అదే సందర్భంలో సీఎం కేసీఆర్ మనువడు, మనుమరాలు రక్షా బంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. తన అన్న హిమాన్షుకు చెల్లె అలేఖ్య రాఖీ కట్టింది. ఈ సందర్భంగా తమ మనుమడు, మనుమరాలును నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని సీఎం కేసీఆర్, శోభమ్మ దంపతులు నిండు మనసుతో దీవించారు. వేడుకల్లో పాల్గొన్న పెద్దలు కూడా చిన్నారులను దీవించారు. మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ, తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY